జగిత్యాల :- కేంద్రంలో టౌన్ హాల్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి డాక్టర్లచే వైద్య శిబిరం ఏర్పాటు చేశామని 164 మందిని డాక్టర్లు పరీక్షించి 84 మందికి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తెలిపారు. మొదటి విడతగా 40 మందిని కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత బస్సులో ఆస్పత్రికి పంపించామని, మిగతా 40 మందిని రెండో విడతగా పంపిస్తామని వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వడ్లగట్ట శంకర్, కోశాధికారి గుండేటి గంగాధర్, కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు మానవురి శ్రీనివాస్,అనుమండ్ల విలాస్, సభ్యులు కట్ల శ్రీనివాస్,శ్రీహరి,దేవదాస్, గంగాధర్, లక్ష్మీనారాయణ గౌడ్,గోపి,ప్రభాకర్ రావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. Shivacharan Chippa