జగిత్యాల జిల్లా :- జాబితాపూర్ గ్రామం లో పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యం లో జంధ్యాల పౌర్ణమి సందర్భంగా కుల బంధువులందరూ కలసి శ్రీ భక్త మార్కండేయుని పూజించి , సంప్రదాయంలో తరతరాలుగా జంధ్యాల పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును, మార్కండేయుని స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం పద్మశాలి కుల బంధువులందరూ ఈ పండుగ ను ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు జోగగంగాధర్, ఉపాధ్యక్షుడు అనుమన్ల నాగేష్, క్యాషియర్ చిప్ప గంగాధర్, రైటర్ అంకం రోషన్, అంకం సతీష్ , గుండేటి గంగారం, అనుమన్ల సత్తయ్య ,రాజు,గంగమల్లు తదితరులు పాల్గొన్నారు
Our Telangana Citizens Reporter.
Mr. Shivacharan Chippa