వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, IPS గారు బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి దేశ శక్తిని ప్రపంచం ముందు వుంచారు, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యుదయానికి అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ అని పోలీస్ కమిషనర్ తెలిపారు. బాబూ జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన వారిలో డీసీపీ లు అబ్దుల్ బారి, రవీందర్, జనగామ ఎ. ఎస్పీ అంకిత్ కుమార్, అదనపు డీసీపీ లు రవి, సంజీవ్ తోపాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐలు, పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.