శాంతి భద్రతల పర్యవేక్షణ ట్రాఫిక్ నియంత్రణ తక్షణ అత్యవసర అవసరాల నిమిత్తం పెట్రోలింగ్ వాహనాలు వినియోగం. వాహనాలను జిల్లా ఎస్పి గారికి అందించిన హీరో మోటార్స్ కార్పొరేట్ హెడ్ కిరణ్ గారు. జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్.,
తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానం నందు ఈ రోజు హీరో మోటార్స్ కార్పొరేట్ హెడ్ కిరణ్ మరియు పృథ్వీ హీరో షో రూమ్ అధినేత పృథ్వీ రెడ్డి వారు హీరో మోటార్స్ యాజమాన్యం తరపున కార్పొరేట్ సామజిక భాద్యత(CSR) లో భాగంగా అధునాతన 80 హీరో గ్లామర్ ద్విచక్రవాహనాలను జిల్లా పోలీసు శాఖకు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు యందు పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మరియు శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి పోలీస్ సిబ్బంది విధిల నిర్వహణలో తమ సొంత వాహనాలను ఉపయోగించడం తరచుగా జరుగుతూ ఉంది. ఈ విషయాన్నీ గమనించిన శ్రీసిటి ప్లాంట్ హీరో మోటార్స్ కంపెనీ యాజమాన్యం వారు శాఖాపరమైన అనుమతితో 80 అదునాతమైన ద్విచక్రవాహనాలను పోలీస్ శాఖకు ఇవ్వడం జరింగింది. వీటి వలన పోలీసు శాఖ దినసరి విధులలో భాగంగా పగటి, రాత్రి గస్తీలకు, విసిబుల్ పోలీసింగ్, లా&ఆర్డర్ ఎన్ఫోర్సుమేంట్, దిశా పెట్రోల్లింగ్ లను మరింత శక్తివంతంగా నిర్వర్తించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు.
ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర పోలీసు శాఖకు 200 ద్విచక్రవాహనాలను కేటాయించిన హీరో మోటార్స్ యాజమాన్యం వారికీ గౌరవ రాష్ట్ర డి.జి.పి. శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐపిఎస్., గారి తరపున జిల్లా ఎస్పి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అయితే అందులో మన తిరుపతి జిల్లాకు పెద్దపీట వేసి 80 ద్విచక్రవాహనాలను కేటాయించుటకు చొరవ తీసుకున్న పృథ్వీ హీరో షో రూమ్ అధినేత పృథ్వీ రెడ్డి, హీరో మోటార్స్ కార్పొరేట్ హెడ్ కిరణ్ వారికి జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు ధన్యవాదాలు తెలియజేశారు.
హీరో మోటార్స్, డీలర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా పోలీసులు నిత్యం ప్రజా సేవలో తలమునకలు అవుతున్నా తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అహర్నిశలు సమర్థవంతంగా భద్రతను కల్పిస్తున్నారు. అలాంటి జిల్లా పోలీస్ శాఖకు మా వంతు సహాయంగా సిఎస్ఆర్ లో భాగంగా “we care” అనే హీరో మోటార్స్ అనుబంధ సంస్థ ద్వారా ఈరోజు 80 వాహనాలను అందజేసి, వారి సేవలో మమ్ములను కూడా భాగస్వామ్యం చేసిన జిల్లా పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం జిల్లా ఎస్పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు జెండా ఊపి 80 ద్విచక్రవాహనాల శ్రేణిని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు శాంతి భద్రత కులశేఖర్, సాయుధ దళం లక్ష్మీనారాయణ రెడ్డి, డిఎస్పి డిఎస్డబ్ల్యూ చంద్ర శేఖర్, ఆర్ఐలు ఎం.టి.ఓ రెడ్డప్ప రెడ్డి, డిఎస్డబ్ల్యూ చలపతి, హీరో మోటార్స్ కార్పొరేట్ హెడ్ కిరణ్, డీలర్ పృథ్వి రెడ్డి మరియు పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.
మా సిటిజన్ రిపోర్టర్ – తెలంగాణ
శ్రీ భరత్ రెడ్డి