తేదీ: 12.03.2024 మంగళ వారం ఉదయం 10::00 గంటల నుండి 01:00 గంటల వరకు జిల్లా ఎస్.పి. శ్రీ హర్షవర్ధన్ గారి ఆదేశాల మేరకు జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తెలంగాణా సాంఘీక సంక్షేమ బాలికా గురుకుల కళాశాల చిట్టిబోయిన్ పల్లిలో జడ్చర్ల టౌన్ పోలీసు స్టేషన్ సి.ఐ. శ్రీ ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో “సురక్ష పోలీసు కళాబృందం” మరియు “మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(A.H.T.U)” వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం.
బాలబాలికలు చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని, మన పెద్దలు చెప్పినట్లుగా కష్టం చేసిన వారెన్నడూ చెడిపోరని పోలీసు కళా బృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా వివరించారు. మన దేశంలోని యువత స్వయంకృషితో అత్యున్నతస్థాయికి ఎదుగుతున్న విషయం చూస్తూనే ఉన్నామని, అటువంటివారి స్పూర్తితో విద్య వైపుగా మన గ్రామీణ యువత దృష్టి సారించి, తలిదండ్రులకు, పుట్టిన ఊరుకు పేరుప్రతిష్టలు తీసుకురావాలని స్ఫూర్తినిచ్చారు. చిన్న వయసులో ప్రేమ అంటూ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వంటి చెడు ఆలోచనలు, అలవాట్ల వలన మనమెప్పటికీ ఎదగలేమని, ఒక ఉత్తమమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని పోలీసు కళాబృందం సభ్యులు ఆటపాటల ద్వారా సూచించారు. పిల్లలను ఉత్తమ మార్గం వైపు నడిపించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు సమయం కేటాయించడం, శ్రద్ధ తీసుకోవడం అవసరమని తెలిపారు. బాల్య వివాహాల వలన వ్యక్తిగత అనర్థాలు జరగడమే కాకుండా సమాజానికి తీరని నష్టం వాటిల్లుతోందని, బాల్య వివాహాలు చేసుకోవద్దని, ఎవరైనా అలా చేయాలని ప్రయత్నించినచో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్-1098 కు ఫోన్ చేయాలని, అలాగే సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని, అనుకోని విధంగా మాయమాటలతో అకౌంట్లో నుండి ఎవరైనా డబ్బులు పోగొట్టుకొన్న యెడల సైబర్ హెల్ప్ లైన్ నంబర్-1930 కి 24 గంటల లోపు కాల్ చేయాలని సూచించారు. యువత సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టించి పని చేయడంలోనే శక్తిసామర్ధ్యాలనూ, గౌరవాన్ని, హోదాను పొందాలని వివరించారు. రకరకాల పద్దతులలో మాయమాటలు చెప్పి పిల్లలను, అమ్మాయిలను, యువతను, మహిళలను అక్రమ రవాణా చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానితులు ఉంటే వెంటనే సంబంధిత ప్రాంతానికి చెందిన పోలీసులకు లేదా డయల్-100కు ఫోన్ చేసి తెలియజేయాలని ,సి.ఐ,గారు మాటలతో, పోలీసు కళా బృందం సభ్యులు పాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మన జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత, బాలబాలికలు గొప్పగా ఎదగాలన్న జిల్లా ఎస్.పి. శ్రీ హర్షవర్ధన్ గారి సందేశాన్ని సురక్ష పోలీసు కళాబృందం మరియు ఏ.హెచ్.టి.యు. సభ్యులు తెలియజేశారు.
కార్యక్రమంలో జడ్చర్ల టౌన్ పోలీసు స్టేషన్ సి.ఐ. శ్రీ ఆదిరెడ్డి గారు వారి సిబ్బంది, తెలంగాణా సాంఘీక సంక్షేమ బాలికా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి శిరీష గారు,అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.