జోగులాంబ గద్వాల జిల్లా: జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్-XI బృందం దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 43 బాలకార్మికులను గుర్తించి వారిని పని నుండి విముక్తి కలిగించి, అందుకు సంబంధించి 2 కేసులు నమోదు చెయ్యడం జరిగిందనీ జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జనవరి 1 నుండి 31 వరకు జిల్లాలోని బైక్ షాపులు కిరాణం షాపులు హోటల్స్ దాబాలలో, రెస్టారెంట్స్ పరిశ్రమలలో పంట పొలాలలో విస్తృతంగా తనిఖీలు చేసి 43 మంది బాల కార్మికులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని, చిన్నారులను బాల కార్మికులుగా పెట్టుకున్న సంఘటనకు సంబంధించి 2 కేసులు నమోదు చెయ్యడం జరిగిందనీ అన్నారు . గుర్తించిన వారిలో 11 మంది బాలికలు ఉండగా 32 మంది బాలురు ఉన్నారని, గుర్తించిన వారిని DCPO వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు. అలగే స్కూల్ డ్రాప్ ఔట్ అయిన మరో 183 పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పాఠశాలలో చేర్పించడం జరిగిందనీ, జిల్లా లో బాల బాలికల ను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, తమ చిన్నారుల మంచి భవిష్యత్ కు తల్లి దండ్రులు తోడ్పడాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100కి కానీ 1098 కి కానీ కాల్ చేసి వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ సూచించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.